Share News

Deputy CM Bhatti Orders Report on GST Rationalization: జీఎ్‌సటీ హేతుబద్ధీకరణ నష్టంపై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Sep 13 , 2025 | 05:19 AM

వస్తు, సేవల పన్ను జీఎ్‌సటీ రేట్ల హేతుబద్ధీకరణతో రాష్ట్రానికి వాటిల్లే ఆదాయ నష్టంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం..

Deputy CM Bhatti Orders Report on GST Rationalization: జీఎ్‌సటీ హేతుబద్ధీకరణ నష్టంపై నివేదిక ఇవ్వండి

  • వాణిజ్య పన్నులపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) రేట్ల హేతుబద్ధీకరణతో రాష్ట్రానికి వాటిల్లే ఆదాయ నష్టంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. జీఎ్‌సటీ నూతన పన్నురేట్లు ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయని, దీని ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంటుందనేది క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడే ప్రమాదం ఉందన్నారు. పన్ను ఎగవేతదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Updated Date - Sep 13 , 2025 | 05:19 AM