ప్రజాస్వామ్యానికి ప్రమాదం
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:17 PM
బీజేపీ రాష్ట్ర సంస్థా గత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి జిల్లా లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ముందు గా అచ్చంపేట నియోకవర్గంలో పర్యటిస్తూ, ఉ మామహేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన, స్వామి వారిని దర్శించుకున్నారు.
- బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి
కందనూలు/ అ చ్చంపేట/ రూరల్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ రాష్ట్ర సంస్థా గత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి జిల్లా లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ముందు గా అచ్చంపేట నియోకవర్గంలో పర్యటిస్తూ, ఉ మామహేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన, స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి అచ్చం పేటలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కా ర్యకర్తల సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు న రేందర్రావు అధ్యక్షతన జరగగా పాల్గొని ప్రసం గించారు. అనంతరం జిల్లా కేంద్రమైన నాగర్క ర్నూల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తల స మావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా కేం ద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఎమర్జెన్సీలో తలపించిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. చంద్రశేఖర్ తివారి మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అ ధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్ర మాదం ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికీ అదే స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని కార్యకర్త లకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్రావు, బీజేపీ పార్లమెంట్ నియోజవర్గ అభ్యర్థి పోతుగంటి భరత్, జిల్లా ఇన్చార్జి మాదగాని శ్రీనివాస్గౌ డ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్రావు, నాయకులు మాంగ్యనాయక్, బల్మూరి జానకి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మోక్తల రేణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు, గ్రామ బూత్ అధ్యక్షుడు సీతారాంనాయక్, గ్రామస్థు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కల్వకోల్లో మొక్కలు నాటిన నాయకులు
పెద్దకొత్తపల్లి : దివంగత కేంద్ర మాజీ మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణ, అమ్మకు వందనం కార్యక్రమంలో భాగంగా మండలం లోని కల్వకోల్ గ్రామంలో ఆ పార్టీ శ్రేణులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూజారి చంద్రశేఖర్, జింకల గోపాల్, పెబ్బేటి శివ, పెబ్బేటి మోహన్, అమ్మపల్లి మల్లేష్, గువ్వలి కుర్మయ్య, పెబ్బేటి శ్రీనివాసులు పాల్గొన్నారు.