నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:08 PM
మంచిర్యాల జిల్లాలోని హాజీ పూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన ని ర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీ సుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం గుడిపేటలో ని ర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
హాజీపూర్, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల జిల్లాలోని హాజీ పూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన ని ర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీ సుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం గుడిపేటలో ని ర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించేందుకు వైద్యులు, సిబ్బం ది సంఖ్యను పెంపొందించేందుకు 216 కోట్ల రూపాయల నిధులతో నిర్మా ణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చే యాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో ని ర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్య క్రమంలో సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.