CM Revanth Reddy Condolence: ఎమ్మెల్యే దొంతి మాతృమూర్తికి సీఎం నివాళి
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:27 AM
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ దశదినం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు...
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు రేవంత్రెడ్డి పరామర్శ
హనుమకొండ, అక్టోబర్ 15(ఆంధ్రజ్యోతి): నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ దశదినం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. హనుమకొండలో నిర్వహించిన మాతృవందనం కార్యక్రమానికి హాజరై దొంతి మాధవరెడ్డిని, ఆయన కటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా కాంతమ్మ చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. దొంతి కుటుంబసభ్యులను పరామర్శించారు.