మోదీ 11ఏళ్ల పాలనపై సంబరాలు
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:02 PM
భారతీ య జనతా పార్టీ మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలనపై ఈ నెల 11 నుంచి 21 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నా మని పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంక టేశ్వర్ గౌడ్ తెలిపారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్
నస్పూర్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : భారతీ య జనతా పార్టీ మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలనపై ఈ నెల 11 నుంచి 21 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నా మని పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంక టేశ్వర్ గౌడ్ తెలిపారు. నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ చేసి న అభివృద్ధి పథకాలు, సాధించిన ఆర్ఖిక ప్ర గతి ఫలాలను ప్రజలకు వివరించాలన్నారు. గ్రామగ్రామాన మోదీ ప్రభుత్వం అమలు చే సిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేప్పాల న్నారు. పర్యావరణ పరిరక్షణకు బీజేపీ నా యకులు, కార్యకర్తలు వారీ కుటుంబ సభ్యుల సంఖ్య ప్రకారం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 15 వ రకు దాదాపు 40 రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమం చేయాలన్నారు. ఈ నెల 23 న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దివాస్ కార్య క్ర మాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలి పారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, పట్టి వెంకట కృష్ణ, ఎన గందుల క్రిష్ణమూర్తి, దుర్గం స్వామి, సదా నందం, అశోక్ వర్థన్, రాజు, సమ్రాజ్ రమేష్, సత్రం రమేష్, కాశెట్టి నాగేశ్వర్ రావు, అశ్విన్, ఈర్ల సదానందం, కుర్ర చక్రి, తాడూరి మ హేష్, మంత్రి రామన్న పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ డివిజన్ కమిటీ ఎన్నిక
బీజేపీ మంచిర్యాల కార్పొరేషన్ జోనల్ శ్రీరాంపూర్ నూతన కమిటీని సోమవారం జి ల్లా అఽధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ప్రకటిం చారు. కార్పోరేషన్ మూడు మండలాలతో కలిపి ఏర్పడగా తమ పార్టీ నాలుగు జోన్లుగా విభజించి కమిటీలను నియమిస్తున్నట్లు తెలి పారు. ఇందులో భాగంగా శ్రీరాంపూర్ అధ్య క్షుడుగా సత్రం రమేష్, ప్రధాన కార్యదర్శు లుగా పోన్నవేని సదయ్య, బద్రి శ్రీకాంత్, ఉపధ్యాక్షులుగా కట్కూరి తిరుపతి, రాజకొండ సత్యనారాయణ, జయమ్మ, కార్యదర్శులుగా సుప్రజ, మాకోటి మల్లేష్, కర్ణ ప్రదీప్, కొంతం మహేందర్, కోశాధికారిగా రాజేందర్లతో పాటు 35 మంది సభ్యులను నియమించి నట్లు తెలిపారు.