Share News

అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలి

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:35 PM

ప్ర జాపాలనలో అందించే సం క్షేమ పథకాలు ప్రజల్లోకి తీ సుకెళ్లి స్థానిక సంస్థల ఎన్ని కల్లో అభ్యుర్థుల గెలుపే ల క్ష్యంగా కార్యకర్తలు పని చే యాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలి
ముఖ్యనాయకుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌, అక్టోబ రు 5 (ఆంధ్రజ్యోతి) : ప్ర జాపాలనలో అందించే సం క్షేమ పథకాలు ప్రజల్లోకి తీ సుకెళ్లి స్థానిక సంస్థల ఎన్ని కల్లో అభ్యుర్థుల గెలుపే ల క్ష్యంగా కార్యకర్తలు పని చే యాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. ఆదివా రం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లింగాల మండల ము ఖ్య నాయకులకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గోని మాట్లాడారు. పార్టీ అధిష్టానం మేరకు అభ్యర్థి గెలుపుకై పార్టీ కుటుంబ సభ్యులు ప్రతీ ఒక్కరు పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్ట పడ్డ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడకండి అని, రిజర్వేషన్లపై అపోహలు నమ్మవద్దని, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ కార్యకర్తను పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల న్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు శ్రీనివాస్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వ ర్‌రావు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు శ్రీనివాస్‌ రాథోడ్‌, నాయకురాలు ఇందిరమ్మ, నాయకులు శివ, నారాయణగౌడ్‌, కొండల్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:35 PM