Share News

kumaram bheem asifabad-లెక్కలు చెప్పాల్సిందే

ABN , Publish Date - Dec 12 , 2025 | 10:18 PM

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ఓడినా, గెలిచినా, ప్రచారం కోసం పెట్టిన ప్రతీ రూపాయి ఖర్చు లెక్క ఎన్నికల కమిషన్‌కు చెప్పాలి. ఏ విడత ఎన్నిక అయినా నామినేషన్‌ వేసిన రోజు నుంచి పోలింగ్‌ ముగిసిన రోజు వరకు (15 రోజులు) సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థుల్లో ప్రతీ ఒక్క అభ్యర్థి ఎన్నికల కోసం నిర్వహించిన లావాదేవీలు నమోదు చేయాల్సిందే. అందుకు ప్రతీ అభ్యర్థి ఖాతాను కొత్తగా తెరవాలి.

kumaram bheem asifabad-లెక్కలు చెప్పాల్సిందే
లోగో

- నామినేషన్‌ నుంచి ఎన్నికలు ముగిసే వరకు

- 45 రోజుల్లో ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి

కాగజ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ఓడినా, గెలిచినా, ప్రచారం కోసం పెట్టిన ప్రతీ రూపాయి ఖర్చు లెక్క ఎన్నికల కమిషన్‌కు చెప్పాలి. ఏ విడత ఎన్నిక అయినా నామినేషన్‌ వేసిన రోజు నుంచి పోలింగ్‌ ముగిసిన రోజు వరకు (15 రోజులు) సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థుల్లో ప్రతీ ఒక్క అభ్యర్థి ఎన్నికల కోసం నిర్వహించిన లావాదేవీలు నమోదు చేయాల్సిందే. అందుకు ప్రతీ అభ్యర్థి ఖాతాను కొత్తగా తెరవాలి. ఆ ఖాతా ద్వారానే ఎన్నికలకు ఖర్చు చేయాలి. పాత ఖాతాలను వినియోగించినట్లయితే అందులో నిర్వహించే ఇతర లావాదేవీలకు సైతం ఖర్చులు చెప్పడం భారంగా మారుతుంది. కాబట్టి అభ్యర్థులు తలనొప్పిగా ఉండకుండా నూతన బ్యాంకు ఖాతాను తెరిస్తే మేలని అధికారులు సూచిస్తున్నారు. నామినేషన్‌ పత్రాలతో పాటు బ్యాంకు ఖాతా జిరాక్స్‌ కాపీని కూడా జత పరచాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5 వేల జనాభాకు మించిన గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులు రూ. 2.5 లక్షలు, వార్డు సభ్యుడు రూ. 50 వేలు మాత్రమే ఎన్నికల వ్యయం చేయాలి. 5వేల లోపు జనాభా ఉండే గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులు రూ. 1.5 లక్షలు, వార్డు సభ్యులు రూ. 30వేలు మాత్రమే ఖర్చు చేయాలని నిబంధనలున్నాయి. ఖర్చు పరిమితి మించితే వేటు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

- మూడు విడతలుగా..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు మూడు విడతలుగా ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించాలి. ప్రచార ప్రారంభంలో మొదటి సారి, ప్రచారం మధ్య దశలో రెండోసారి, పోలింగ్‌కు ముందు రోజు మూడోసారి లెక్కలు ఇవ్వాలి. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో అభ్యర్థులు వారి ఖర్చు లెక్కలు ఎన్నికల అధికారులకు తగిన బిల్లులతో సమర్పించాలి. ఎన్నికల ఖర్చులు నామినేషన్‌ పత్రంలో సూచించిన బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి. ఓడినా, గెలిచినా ఖర్చు లెక్కలు ఇవ్వాల్సిందే. గెలిచిన అభ్యర్థులు ఖర్చు లెక్కలు ఇవ్వకుంటే పదవికే ఎసరు వస్తుంది. ఓడిన అభ్యర్థులు ఇవ్వకుంటే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చులను పరిశీలించడానికి ఆయా మండలాల పరిధిలో ఉండే వ్యయ పరిశీలకులకే లెక్కలు అందజేయాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వినియోగించే పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ప్రింట్‌, డిజిటల్‌ మీడియా ప్రకటనలు, వాహనం అద్దె, డ్రైవర్‌ వేతనం, ఇందనం, మైకులు, సౌండ్‌ సిస్టం, టెంట్లు, కుర్చీలు, భోజనం, లాడ్జింగ్‌, బోర్డింగ్‌, కార్యకర్తలకు ఇచ్చే ఖర్చులు, జెండాలు, టీ, టిఫిన్‌, కాఫీలు, టీ-షర్టులు, బాడ్జీలు, ప్రచార వాహనాల అలంకరణ ఖర్చుల లెక్కలు చూపాల్సి ఉంటంది. వాటి ధరలు ఎన్నికల అధికారులు నిర్ణయించిన మేరకు ఉండాలి.

Updated Date - Dec 12 , 2025 | 10:18 PM