Union Minister G. Kishan Reddy: ఓట్లు చీలి బీజేపీయే కింగ్
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:09 AM
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరులో వివిధ వర్గాల ఓట్లు చీలి బీజేపీ ‘కింగ్’ అవుతుందని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు...
త్రిముఖ పోరులో మాదే గెలుపు.. కేసీఆర్ మళ్లీ సీఎం అంటూ కేటీఆర్ పగటి కలలు
కేసీఆర్ 2 గంటలు పాదయాత్ర చేసి ఓటడగాలి
ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డీల్
మజ్లి్సను బీఆర్ఎస్, కాంగ్రెస్ పెంచి పోషించాయి
2, 3 వేలకు ఓటు అమ్ముకోవద్దు
మీడియాతో చిట్చాట్, ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి
హైదరాబాద్/ఎర్రగడ్డ/హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరులో వివిధ వర్గాల ఓట్లు చీలి బీజేపీ ‘కింగ్’ అవుతుందని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటమి భయంతోనే గత ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్కు ఈసారి టికెట్ ఇవ్వలేదన్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా గెలుస్తామన్న ఆశలో ఉందని విమర్శించారు. రెండేళ్లుగా ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారని, ఈ విషయంలో కేటీఆర్ పగటికలలు కంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఓటు అడిగే ముందు కేసీఆర్ రెండు గంటల పాటు జూబ్లీ హిల్స్లో పాదయాత్ర చేసి, బీఆర్ఎస్ హయాంలో అక్కడ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడారు. జూబ్లీహిల్స్లో మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేస్తారా? అన్న ప్రశ్నకు కిషన్ రెడ్డి స్పందిస్తూ ఆయన ప్రధాని మోదీ అభిమాని అని అన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఒక సంస్థ నిర్వహించిన సర్వేపై ఆయన స్పందిస్తూ ఆ సర్వేను బాత్రూంలో నిర్వహించారా? బెడ్రూంలో నిర్వహించారా? అని మండిపడ్డారు. తామంతా సమష్టిగానే ప్రచారం చేస్తున్నామని, స్థానిక ఎంపీగా, తనకు కూడా పార్టీయే ప్రచార కార్యక్రమాలను నిర్దేశిస్తోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రె్సదేనని అన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే అన్ని స్థానాల్లోనూ ఎంఐఎం పోటీ చేయడం ఖాయం. సీఎం రేవంత్కు ధైర్యముంటే బీసీలకు కేటాయించిన స్థానాల్లో కూడా ఎంఐఎం పోటీ చేయబోదని ప్రకటించాల’ని సవాల్ చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. మజ్లి్సను పెంచి పోషించిన బీఆర్ఎస్, కాంగ్రె్సకు బుద్ధి చెప్పాలన్నారు. మజ్లిస్ ఆగడాలతో ఎంతో మంది బస్తీలు ఖాళీ చేస్తున్నారని, అలాంటి పరిస్థితి జూబ్లీ హిల్స్కు రాకూడదంటే బీజేపీకి ఓటేయాలని కోరారు. మజ్లిస్ నుంచి హైదరాబాద్ను రక్షించుకోవాలన్నారు. రెండు, మూడు వేలకు ఓట్లు అమ్ముకోవ్దదని, మన పిల్లల భవిష్యత్తు, బస్తీలు, జూబ్లీ హిల్స్ను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. హామీలను తుంగలో తొక్కిన కాంగ్రె్సకు ఓటేస్తే మీ విలువైన ఓటు వృథా అయినట్లేనన్నారు. మెట్రోను తాను అడ్డుకుంటున్నట్లు తప్పుడుప్రచారం చేయడం కాంగ్రెస్ మంత్రులకు రివాజుగా మారిందని విమర్శించారు. ఫోన్ట్యాపింగ్ కేసులో బీజేపీ ఇంప్లీడ్ అయిందని చెప్పారు.