Share News

Bhatti Vikramarka: రెండేళ్లలో అభివృద్ధి చేసి చూపించాం

ABN , Publish Date - Nov 17 , 2025 | 06:28 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి అంటే ఏమిటో...

Bhatti Vikramarka: రెండేళ్లలో అభివృద్ధి చేసి చూపించాం

  • 2047 తెలంగాణ రైజింగ్‌ విన్‌ డాక్యుమెంట్‌ను ప్రపంచానికి చూపిస్తాం: భట్టి విక్రమార్క

కందుకూరు, నవంబరు 16 (ఆధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2047 తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రపంచానికి చూపించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. డిసెంబరు 8, 9వ తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్కాన్‌పేటలో చేపడుతున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌-2025 వేదికను ఆదివారం ఆయన సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 2047 వరకు తెలంగా ణ ఏ రకంగా ఉండబోతుంది.. ఎలా ఉండాలి? అనే విషయాలను ప్రజాప్రభుత్వం సమ్మిట్‌లో వివరిస్తుందని చెప్పారు. గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణకు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో వేదిక ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని, అందులో ఫ్యూచర్‌ సిటీ, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, దుండిగల్‌ ప్రాంతాలు ఉన్నట్లు తెలిపారు. గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని, హైదరాబాద్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన స్థలాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 06:30 AM