Share News

మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:11 PM

వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఇన్‌చార్జి డీ ఎంహెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌ కోరారు.

మెరుగైన వైద్య సేవలందించాలి
కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌

- డీఎంహెచ్‌వో రవికుమార్‌

కల్వకుర్తి/వెల్దండ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యో తి) : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఇన్‌చార్జి డీ ఎంహెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌ కోరారు. కల్వ కుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని, డిప్యూ టీ డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని శనివారం ఆ యన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులను రోగులకు అందుతున్న సేవలను అ డిగి తెలుసుకున్నారు. తనిఖీ సమయంలో డి ప్యూటీ డీఎంహెచ్‌వో భీమానాయక్‌, ప్రభుత్వ ఆ సుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివరాం, గైన కాలజిస్టు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఫ వెల్దండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో అసంపూర్తి పనులను జిల్లా వైద్యాధికారి రవికుమార్‌ పరిశీలించా రు. పనుల విషయమై సంబంధిత కాంట్రాక్టర్‌, ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో బీమానాయక్‌, డాక్టర్‌ సింధు, పీవో లక్ష్మణ్‌ నాయక్‌, పర్వతాలు, మనోజ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:12 PM