Share News

kumaram bheem asifabad- సమతుల ఆహారం.. సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:23 PM

మాత శిశు మరణాలను నివారించడంతో పాటు ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ప్రభు త్వం పోషణ మాసం మాసం కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహరం అందిస్తూ పోషణ స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తొంది. పోషణ మాసోత్సవాలు ఆక్టోబరు 16వ తేది వరకు కొనసాగుతాయి.

kumaram bheem asifabad- సమతుల ఆహారం.. సంపూర్ణ ఆరోగ్యం
అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలు

- అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహణ

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యో తి): మాత శిశు మరణాలను నివారించడంతో పాటు ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ప్రభు త్వం పోషణ మాసం మాసం కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహరం అందిస్తూ పోషణ స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తొంది. పోషణ మాసోత్సవాలు ఆక్టోబరు 16వ తేది వరకు కొనసాగుతాయి. ఈ పోషణ మాసంలో గర్భిణులు, బాలింతలతో సమావేశాలను ఏర్పాటు చేసి పౌష్టికాహారంపై అవగాహన కల్పించనున్నారు. స్వ యంగా అంగన్‌వాడీలు తయారు చేసిన పౌష్టికాహారాన్ని వారికి అందించనున్నారు.

- ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు

జిల్లాలో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 0-6నెలల పిల్లలు 2272 మంది, 7నెలల నుంచి 3 ఏళ్ల లోపు 19,799 మంది, 3 నుంచి 6 సంవత్సరాల లోపు 23,160 మంది ఉన్నారు. కిశోర బాలికలు 21,516 మంది, గర్భిణులు 5,534 మంది, బాలింతలు 2,373 మంది ఉన్నారు. కాగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇప్పటికే గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు పిల్లలకు పాలు, గుడ్లు, బాలామృతంతో పాటు పలు రకాల పౌష్టికాహరాన్ని అందిస్తున్నారు. అదే విధం గా పిల్లల ఎత్తు, బరువు తీసుకొని వారికి అవసరమైన వైద్య పరీక్షలను చేయి స్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఐదేళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సంపూర్ణ మధ్యాహ్న భోజనం అందిస్తున్నా రు. ప్రతి నెల 30 గుడ్లు, రోజు ఒక్కొక్కరికి 200 మిల్లీ లీటరల్ల పాలను ఇస్తూ మాతాశిశు ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు.

పోషణ మాసం కార్యక్రమాలు ఇలా..

- స్థానిక ఉత్పత్తులు, బొమ్మలు, పౌష్టికాహరం పదార్థాల వినియోగంపై అవగాహన.

- గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల పోషణపై సూచనలు ఇస్తారు. అనుబంధ ఆహారాల తయారీ, వంటకాల పోటీలు నిర్వహిస్తారు.

- కిశోర బాలికలకు వైద్య పరీక్షలతో పాటు పిల్ల ల బరువు, ఎత్తు, కొలతలను తీస్తారు. ఆహారంలో నూనె వినియోగం తగ్గించడంపై అవగాహన.

- చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకులకు అను బంధ ఆహరంపై పోటీలు, తల్లిదండ్రులతో పోషకా హారం ప్రతిజ్ఞ. అంగన్‌వాడీ కేంద్రాల్లో కథలు చెప్పడం, బొమ్మల ప్రదర్శన, వాటి ద్వారా ఈసీసీఈ సెషన్‌, 0-3 ఏళ్ల పిల్లల అరంభ అభివృద్ధి ప్రేరణ కోసం దృష్టి సారించాల్సిన కార్యక్రమాలు తల్లిదండ్రులతో చేయించడం.

- పోషణ లోపం ఉన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, అకలి పరీక్షలు, గ్రోత్‌ మానిటరింగ్‌, పిల్లల బరువు, ఎత్తు కొలవడం.

- బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు తాపడం, పిల్లల అనుబంధ ఆహారంపై అవగాహన.

- ఆరోగ్యకరమైన ఆహరపు అలవాట్లు, జీవన శైలిపై అవగాహన.

- స్థానిక వంటకాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, స్వదేశీ బొమ్మల తయారీ.

- పోషణ మిషన్‌ వంద రోజుల ప్రచారం, గ్రామ, వార్డు సభలు, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ, గృ హ సందర్శన, అంగన్‌వాడీ కేంద్రాల్లో శుభ్రత తదితర ఆంశాలపై అవగాహన కల్పించడం.

అవగాహన కల్పిస్తున్నాం..

- అడెపు భాస్కర్‌, జిల్లా సంక్షేమాధికారి

గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగా హన కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు పోషకా హారం తీసుకుంటే మాతా శివు మరణాలను తగ్గించవచ్చు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమ పద్ధతుల్లో తీసుకుంటే మంచిది. అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్నప్రాసన, జన్మదిన వేడుకలను కూడా నిర్వహించనున్నాం.

Updated Date - Sep 17 , 2025 | 11:23 PM