ఎల్ఆర్ఎస్ రాయితీపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:17 PM
మునిసిపా లిటీ పరిధిలోని అనుమతి లేని లేఅవుట్లను ప్రభుత్వం కల్పిం చిన 25శాతం ఎల్ఆర్ఎస్ రా యితీని ప్రజల్లో విస్తృత అవగా హన కల్పించాలని నాగర్క ర్నూల్ మునిసిపల్ కమిషనర్ నరేష్బాబు అధికారులను ఆదేశించారు.

- మునిసిపల్ కమిషనర్ నరేష్బాబు
నాగర్కర్నూల్ టౌన్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : మునిసిపా లిటీ పరిధిలోని అనుమతి లేని లేఅవుట్లను ప్రభుత్వం కల్పిం చిన 25శాతం ఎల్ఆర్ఎస్ రా యితీని ప్రజల్లో విస్తృత అవగా హన కల్పించాలని నాగర్క ర్నూల్ మునిసిపల్ కమిషనర్ నరేష్బాబు అధికారులను ఆదేశించారు. బుధ వారం మునిసిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్స్, ఎల్టీపీఎస్, రియల్ఎస్టేట్ ఏజెంట్లతో మునిసి పల్ కమిషనర్ సమావేశం నిర్వహించి మాటా ్లడారు. అనుమతి లేని లేఅవుట్లను క్రమబద్ధీక రించుకునేందుకు 2020లో స్వీకరించిన ఎల్ఆర్ ఎస్ దరఖాస్తులను ఈనెల 31లోపు 25శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవ కాశం కల్పించిందని పేర్కొన్నారు. ఈ అవకాశా న్ని మునిసిపాలిటీ పరిధిలోని ఎల్ఆర్ఎస్ ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకో వాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి వికాస్, సబ్ రిజిస్ట్రార్, మునిసిపల్ మేనేజరు పాల్గొన్నారు.