Share News

సీజేఐపై దాడికి యత్నం హేయమైన చర్య

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:15 PM

సుప్రీం కోర్టులో సీజేఐ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌పై ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని జి ల్లాలోని పలు ప్రజాసంఘాల నాయకులు తీ వ్రంగా ఖండించారు.

సీజేఐపై దాడికి యత్నం హేయమైన చర్య
అచ్చంపేటలో అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసనలో పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేందర్‌

- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం ఘటనపై నిరసన

- అచ్చంపేటలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేందర్‌

- మతోన్మాద విష సంస్కృతి వల్లే ఈ భౌతిక దాడులు

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ

కందనూలు/ కొల్లాపూర్‌/ కల్వకుర్తి/ అచ్చం పేటటౌన్‌/ నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ తాడూరు/ బ ల్మూరు/ అమ్రాబాద్‌/ మన్ననూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : సుప్రీం కోర్టులో సీజేఐ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌పై ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని జి ల్లాలోని పలు ప్రజాసంఘాల నాయకులు తీ వ్రంగా ఖండించారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు. ధర్మపీఠంపై దాడిగా అ భివర్ణిస్తూ, తీవ్రంగా ఖండించారు. షూ విసిరేం దుకు యత్నించిన న్యాయవాది రాకేష్‌ కిశోర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు.

- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌పై దాడిని నిరసిస్తూ మంగళవారం అచ్చంపేటలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ని రసన తెలిపి న్యాయవాది రాకేష్‌ కిశోర్‌ దిష్టిబొమ్మ దహ నం చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేం దర్‌ మాట్లాడుతూ దాడిని ఖండించారు.

- కొల్లాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు ఎదుట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వ ర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు.

- నాగర్‌కర్నూల్‌లో బీఎస్పీ రాష్ట్ర కమిటీ స భ్యుడు పృథ్వీరాజ్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

- నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్క ర్‌ చౌరస్తాలో దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్‌) జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరస న చేపట్టా రు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు ఎం.బాలనరసింహ, కొమ్ము భరత్‌, బండి లక్ష్మీపతి మాట్లాడుతూ మతోన్మాద విషసంస్కృ తి వల్లే దాడులు జరుగుతున్నాయని అన్నారు.

- తాడూరులో అంబేడ్కర్‌ విగ్రహం ముందు కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

- బల్మూరులో అంబేడ్కర్‌ సంఘం మండల నాయకులు గణేష్‌కుమార్‌, గంగాధర్‌ ఆధ్వర్యం లో నిరసన చేపట్టారు.

- అమ్రాబాద్‌లో డీటీఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు భీమయ్య, శివలింగం విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయిపై దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్‌ కిశోర్‌ను చట్టపరంగా కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు.

- అమ్రాబాద్‌ మండలం మన్ననూరులో మం గళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా నాయకుడు మల్లేష్‌ మాట్లాడుతూ సీజీపై దాడికి పాల్పడిన న్యాయవాది రాజేష్‌ కిషోర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

- కల్వకుర్తిలో కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల పరశురాములు, సీఐటీయూ అధ్యక్షుడు బి.ఆంజనేయులు ఆధ్వర్యంలో సీజేఐ పై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడి అని అభివర్ణిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - Oct 07 , 2025 | 11:15 PM