గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు
ABN , Publish Date - May 09 , 2025 | 11:57 PM
గంజాయికి బానిసై సు లభమార్గంలో డ బ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి తో పాటు కొనుగో లు చేస్తున్న వ్య క్తులను వనటౌన పోలీసులు అ రెస్టు చేశారు.

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు
నల్లగొండటౌన, మే 9(ఆంధ్రజ్యోతి): గంజాయికి బానిసై సు లభమార్గంలో డ బ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి తో పాటు కొనుగో లు చేస్తున్న వ్య క్తులను వనటౌన పోలీసులు అ రెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.3 కిలోల గంజాయిని మోటార్ సైకిల్ సెల్ఫోనను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పట్టణంలోని వనటౌన పోలీ్సస్టేషనలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వన టౌన సీఐ రాజశేఖర్రెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బాహర్పేటకు చెందిన జొన్నల రవీందర్ అలియాస్ బాబి స్వీపర్ పనిచేస్తుండేవాడు. ఆయన తన స్నేహితురాలైన జమ్మలగూడకు చెందిన రమ్యకృష్ణ అలియాస్ పింకితో కలిసి కొంతకాలంగా గంజాయికి అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో గంజాయి వాడటంతో పాటు విక్రయిస్తే తమ ఖర్చులు మిగలడంతో పాటు లాభాలు వస్తాయని ఆశించారు. దీంతో అక్రమంగా సంపాదించాలనే ధ్యేయంతో రవీందర్ హై దరాబాద్లోని దూల్పేటలో గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా గంజాయిని కొనుగోలు చేశాడు. కొంత వాడుకొని మిగితాది ఎక్కువ ధరకు అవసరం ఉన్న వారికి విక్రయించేవారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం రవీందర్ కిలోన్నర గంజాయిని దూల్పేటలో కొనుగోలు చేసి కొంత తాను రమ్యకృష్ణ వాడుకున్నారు. మిగతాది పట్టణంలో కావాల్సిన వారికి అమ్మాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం తులసీనగర్ కట్ట మైసమ్మ గుడి వద్ద చైతన్యనగర్కు చెందిన ఏసీ టెక్నిషియన యానక నరే్షపాల్కు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయి, సెల్ఫోన, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసులో రమ్యకృష్ణ పరారీలో ఉన్నట్లు సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు. అరెస్టు అయిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ వి.శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.