అతిసార నిరోధక అవగాహన ర్యాలీ
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:13 PM
అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్ర మంలో భాగంగా నస్పూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం (తీగల్పహాడ్)లో మంగళవారం అతిసార వ్యాధి నిరోధక అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వై ద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జులై 31వ తేదీ వరకు అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించనుంది.
నస్పూర్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్ర మంలో భాగంగా నస్పూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం (తీగల్పహాడ్)లో మంగళవారం అతిసార వ్యాధి నిరోధక అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వై ద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జులై 31వ తేదీ వరకు అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించనుంది. తీగల్పహాడ్ ఉప కేంద్రం వద్ద నుంచి జాతీయ ర హదారి వెంట వైద్యాధికారులు, వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆరోగ్య శాఖ ఉప వైద్య అధికారి డాక్టర్ అనిత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి కృపాబాయి, ప్రో గ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ సమత, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సిహెచ్వో రమేశ్, వెంకటేశ్, సునిల్ పాల్గొన్నారు.