కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:06 PM
కాంగ్రెస్ పా ర్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మల ని ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ అన్నారు.
- అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
బల్మూరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పా ర్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మల ని ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జిన్కుం ట కనకాలమైసమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వ హించి మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అభివృ ద్ధిలో పథకాలపై గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కలిగించాలని కార్యకర్తలకు సూచిం చారు. నల్లమల ప్రాంతంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, నాయకులు కాశన్నయాదవ్, సుధాకర్గౌడ్, గిరివర్ధన్ గౌడ్, శ్రీనివాసులు, మశన్న, నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.