Share News

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:34 PM

ఎవరైన చట్టవ్యతిరేక పనులకు పా ల్పడితే చర్యలు తప్పవనిమాల గురిజాల సీఐ అనుక్‌ అన్నారు. సోమవా రం మండలంలోని బట్వాన్‌పల్లి గ్రామంలో ఎక్సయిజ్‌ అధికారులతో కలి సి కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించి మాట్లాడారు. ఎవరైన గు డుంబాను తయారు చేసిన విక్రయించిన చట్టపరమైన చర్యలు చేపడు తామన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్న సీఐ, పోలీసులు

బెల్లంపల్లి, జూలై21 (ఆంధ్రజ్యోతి): ఎవరైన చట్టవ్యతిరేక పనులకు పా ల్పడితే చర్యలు తప్పవనిమాల గురిజాల సీఐ అనుక్‌ అన్నారు. సోమవా రం మండలంలోని బట్వాన్‌పల్లి గ్రామంలో ఎక్సయిజ్‌ అధికారులతో కలి సి కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించి మాట్లాడారు. ఎవరైన గు డుంబాను తయారు చేసిన విక్రయించిన చట్టపరమైన చర్యలు చేపడు తామన్నారు. గుడుంబా సేవించడం వలన అనారోగ్యాల భారినపడి మృ త్యువాత పడతారన్నారు. పిల్లలు చెడు అలవాట్లకు లోనుకాకుండా చూ సుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందన్నారు. ఏదైనసమస్య ఉంటే డయల్‌ 100కు సమచారం అందించాలని సూచించారు. 31 ద్విచక్ర వాహ నాలు, మూడు ఆటోలకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేశామన్నారు. నాయిని లచ్చయ్య, మలోతు అనే వ్యక్తులవద్ద నుంచి 200 లీటర్ల బెల్లంపానకం ధ్వంసం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తా ళ్లగురిజాల ఎస్‌ఐ రమేశ్‌, కన్నెపల్లి ఎస్‌ఐ భాస్కర్‌,భీమినిఎస్‌ఐ విజ య్‌, బెల్లంపల్లివన్‌టౌన్‌ ఎ స్‌ఐ రాకేశ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:34 PM