అభయాంజనేయస్వామి ఆలయ ప్రతిష్టాపన వేడుకలు
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:38 PM
మండలంలోని నంనూర్ పునరా వా సాస కాలనీలో నూతనంగా నిర్మించిన భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు మంగళవారం మొదలయ్యాయి. విగ్రహాలను ఊరేగింపుతో ఆలయ మండపానికి తీసుకొచ్చారు. అభయాంజనేయ, భ క్తాంజనేయ, శివపంచాయతీల, నాగేంద్ర, నవగ్రహ, ద్వజశిఖర ప్రతి ష్టాపన మహోత్సవంలో మొదటిరోజు గుడిప్రధాన దాత అయిన ఆన్ కార్ పద్మశ్రీ సత్యనారాయణ దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
హాజీపూర్,జూన్3(ఆంధ్రజ్యోతి): మండలంలోని నంనూర్ పునరా వా సాస కాలనీలో నూతనంగా నిర్మించిన భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు మంగళవారం మొదలయ్యాయి. విగ్రహాలను ఊరేగింపుతో ఆలయ మండపానికి తీసుకొచ్చారు. అభయాంజనేయ, భ క్తాంజనేయ, శివపంచాయతీల, నాగేంద్ర, నవగ్రహ, ద్వజశిఖర ప్రతి ష్టాపన మహోత్సవంలో మొదటిరోజు గుడిప్రధాన దాత అయిన ఆన్ కార్ పద్మశ్రీ సత్యనారాయణ దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అచ్చులాపూర్ వేదపాఠశాలకు చెం దిన ముద్దు దీరజ్ అవధాని ఆధ్వర్యంలో పది మంది వేదపండితులు పూజలో పాల్గొన్నారు. గ్రామస్తులు విగ్రహాల జలాధివాసంలో పాల్గొన్నా రు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బేర పోచయ్య, ఒడ్డె శ్రీని వాస్, ఒడ్డే బాలరాజు, పెద్దపల్లి స్వామి, కారుకూరి తిరుపతి, ఒడ్డే రాజ మౌళి, తిరుపతి, ఆకిరెడ్డి వెంకటేశ్, గోపులింగయ్య, రాసమల్ల శ్రీనివాస్ గౌడ్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.