Share News

కార్మికుల హక్కులను కాపాడే నాయకుడినే గెలిపించుకోవాలి

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:32 PM

ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ లో కార్మికుల హక్కులను కాపాడే నాయకున్నే గెలిపించుకోవాలని తెలంగాణ కనీస వేతనాల కమిటీ చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌ అన్నారు. శని వారం దేవాపూర్‌ కంపెనీ ఆవరణలో ఓరి యంట్‌ సిమెంట్‌ స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరే షన్‌ యూనియన్‌ నిర్వహించి గేటు మీటిం గ్‌కు ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు.

కార్మికుల హక్కులను కాపాడే నాయకుడినే గెలిపించుకోవాలి
దేవాపూర్‌ సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ కనీస వేతనాల కమిటీ చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌

కాసిపేట, ఆగస్టు16 (ఆంధ్రజ్యోతి): ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ లో కార్మికుల హక్కులను కాపాడే నాయకున్నే గెలిపించుకోవాలని తెలంగాణ కనీస వేతనాల కమిటీ చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌ అన్నారు. శని వారం దేవాపూర్‌ కంపెనీ ఆవరణలో ఓరి యంట్‌ సిమెంట్‌ స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరే షన్‌ యూనియన్‌ నిర్వహించి గేటు మీటిం గ్‌కు ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. ఓ రియంట్‌ సిమెంట్‌ కంపెనీలో కన్నేళ్లుగా కార్మి కులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. వా రి హక్కుల పరిరక్షణ కోసం కొక్కిరాల సత్య పాల్‌రావును గెలిపించుకోవాలని సూచించా రు. స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సీఎస్‌ఆర్‌ నిధులను ఓ రియంట్‌ ప్రభావిత గ్రామాల్లోనే అభివృద్ధి ప రిచేందుకు కృషి చేస్తామన్నారు. ఓరియంట్‌ కార్మికులకు గ్రూపు గ్రాట్యువిటి ఇప్పించే వి ధంగా యాజమాన్యంతో పోరాడి సాధిస్తా మన్నారు. కార్యక్రమంలో ఓ రియంట్‌సిమెంట్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ యూనియన్‌ అధ్యక్షులు కొక్కిరాల సత్యపాల్‌రావు మాట్లాడు తూ యూనియన్‌ అధికారంలోకి వస్తే కార్మికు ల కోసం 24గంటల వైద్యసదుపాయం కల్పిం చడంతో పాటు 5లక్షల మెడిక్లైమ్‌ ఇప్పిస్తామ ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎ న్‌టీయుసీ సెంట్రల్‌ కమిటీ ఉపాధ్యక్షుడు కాం పెల్లి సమ్మయ్య, మందమర్రి ఏరియా ఉపాధ్య క్షుడు దేవి భూమయ్య, రాపర్తి శ్రీనివాస్‌, గిరి జన సంఘాల నాయకులు సిడాం అచ్యుత్‌ రావు, రాందాస్‌, కుమురం జనార్ధన్‌, సతీష్‌ రెడ్డి, శంకర్‌, సతీష్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 11:33 PM