చెర్వుగట్టుపై వైభవంగా మాస కల్యాణం
ABN , Publish Date - May 13 , 2025 | 12:12 AM
పౌర్ణమి తిథిని పురస్కరించుకుని నార్కట్పల్లి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం మాసకల్యాణం ఘనంగా నిర్వహించారు.
చెర్వుగట్టుపై వైభవంగా మాస కల్యాణం
నార్కట్పల్లి, మే 12 (ఆంధ్రజ్యోతి): పౌర్ణమి తిథిని పురస్కరించుకుని నార్కట్పల్లి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం మాసకల్యాణం ఘనంగా నిర్వహించారు. మహామంటపంలో నిర్వహించిన ఈ కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు సురే్షశర్మ, సతీ్షశర్మ వేదపండితుల మంత్రోచ్చారణలు, సన్నాయి వాయిద్యాల మధ్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ వేడుకల్లో పలువురు దంపతులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.
గోపలాయపల్లిలో: గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో కూడా మాస కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయంలో యజ్ఞ మంటపం వద్ద నిర్వహించిన కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యా రు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఉత్సవంలో దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.