ఘనంగా రైతు పండుగ
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:27 PM
రాష్ట్ర ప్రభుత్వం సీజన్కు ముందే రైతుల కు రైతు భరోసా ఇవ్వడంపై రైతు పండగ పేరు తో జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు.
ఉప్పునుంతల/ చారకొండ/ అచ్చంపేటటౌన్/ అమ్రాబాద్/ వంగూరు, జూన్ 24 (ఆంధ్రజ్యో తి) : రాష్ట్ర ప్రభుత్వం సీజన్కు ముందే రైతుల కు రైతు భరోసా ఇవ్వడంపై రైతు పండగ పేరు తో జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి 9 రోజు ల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు. ఉప్పునుంత లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్ట ర్ వంశీకృష్ణ చిత్రపటాలకు క్షీరాభిషేక్షం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్టా అనంత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు అనంతప్రతాప్రెడ్డి, నాయకు లు ఉన్నారు.
ఫ చారకొండ : మండల కేంద్రంలోని అంబే డ్కర్ చౌరస్తాలో బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకట్గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాలరాంగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులతో కలిసి సీఎం రేవం త్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణల చిత్రపటా నికి క్షీరాభిషేకం చేశా రు. కార్యక్రమంలో కి సాన్ సెల్ మండల అ ధ్యక్షుడు వెంకట్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లక్ష్మ య్యగౌడ్, మండల వ ర్కింగ్ ప్రసిడెంట్ అంజ య్య, పాల్గొన్నారు.
ఫ అచ్చంపేటటౌన్ : పట్టణంలోని అంబే డ్కర్ చౌరస్తాలో మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసు లు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు కుంద మల్లికార్జున్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. నాయకులు వెంకటేష్, రాజగోపాల్ పాల్గొన్నారు.
ఫ అమ్రాబాద్ : కాంగ్రెస్ మండల అధ్యక్షు డు హరినారాయణ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నా యకులు పంబలి బుచ్చయ్య, బాల్లింగం గౌడ్, లింగం రేణయ్య, సంతోష్ ఉన్నారు.
ఫ వంగూరు : వంగూరులో కల్వకుర్తి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ అల్వాల్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో క్యామ మల్లయ్య. రమేష్గౌడ్ తిరుమలయ్య, సతీష్రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.