విద్యార్థులను పట్టించుకోని ప్రభుత్వం
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:32 PM
గిరిజన ఆశ్రమ పాఠ శాలల్లోని విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. పట్టణం లోని సాయికుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన సోమవారం పరామర్శించారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : గిరిజన ఆశ్రమ పాఠ శాలల్లోని విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. పట్టణం లోని సాయికుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా లుగు రోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం తినడంతో ఇ ద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారన్నారు. కనీసం తల్లి దండ్రుల కు సమాచారం ఇవ్వకపోవడం ఏంటని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, విద్య, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.