మహిళా సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:56 PM
ప్రజాపాలనలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మహిళ ల సంక్షేమానికి పెద్దపీట వేస్తు న్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నా రు.
- ఇందిరా మహిళా శక్తి యూనిఫామ్ చీరల పంపిణీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
చారకొండ/ వంగూరు/ మ న్ననూరు/ ఉప్పునుంతల, న వంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలనలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మహిళ ల సంక్షేమానికి పెద్దపీట వేస్తు న్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నా రు. ఆదివారం అచ్చంపేట ని యోజకవర్గంలోని చారకొండ, వంగూరు, మన్న నూరు, ఉప్పునుంతల మండలాల్లో ప్రభుత్వం నుంచి వచ్చిన ఇందిరా మహిళా శక్తి యూని ఫామ్ చీరల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. చారకొండలో ఎంపీడీవో శంకర్నా యక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వంగూరులో ఇందిరమ్మ చీరలను మ హిళలకు వంశీకృష్ణ పంపిణీ చేశారు. అనంత రం వంగూరులో వాల్మీకి సంఘం నూతన భవ నానికి, మిట్టసదగోడులో రూ.63 లక్షలతో నిర్మి స్తున్న పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. వాల్మీ కి భవనానికి రూ. 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఉప్పునుంతలలోని స్త్రీ శక్తిభవనం ఆవ రణలో మహిళా సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ చీరలను పంపిణీ చేశారు. ఆయా మండలాల్లో ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే వంశీకృ ష్ణ మాట్లాడుతూ రాబోయే మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను మహిళలకు ప్రవేశపెట్టి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం మూడవసారి డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్యే వంశీకృష్ణను కాంగ్రెస్ నా యకులు, కార్యకర్తలు శాలువాతో సన్మానిం చారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ డీఆర్డీవో రాజేశ్వరి, తహసీల్దార్ ఉమ, ఏపీఎం శ్రీనివాసు లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంక ట్గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాలరాంగౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రఽధాన కార్యదర్శి నాయిని జైపాల్, మం డల యూత్ ప్రసిడెంట్ గణేష్గౌడ్, ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షుడు గోరటి శివ, మాజీ జడ్పీటీసీ భీముడు నాయక్, మాజీ ఎంపీటీసీలు గ్యార లక్ష్మణ్, నరసింహారెడ్డి, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి శంకర్గౌడ్, వంగూరు మండ ల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నర్మద, డీపీ ఎం చెన్నయ్య, ఏపీఎం సైదులు, మాజీ సర్పం చ్ అల్వాల్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, క్యామ మల్లయ్య, హర్షిత్రెడ్డి, రమేష్గౌడ్, బొజ్జ కృష్ణారెడ్డి, వంగూరులో మండల అధ్యక్షుడు పెంకుల పర్వతాలు, సలేశ్వరం, బక్కయ్య, రమే ష్, శ్రీను, ఉప్పునుంతలలో ఆలయ చైర్మన్ న ర్సింహారావు, మాజీ జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు లలిత, ఏపీఎం బాలచంద్రయ్య, జిల్లెల జగత్రెడ్డి పాల్గొన్నారు.