Share News

Panchayat Officers: 18 మంది ఎంపీవోలకు పదోన్నతులు

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:04 AM

పలు జిల్లాలకు చెందిన 18 మంది మండల పంచాయతీ అధికారుల ఎంపీవో కు డివిజనల్‌ పంచాయతీ...

Panchayat Officers: 18 మంది ఎంపీవోలకు పదోన్నతులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పలు జిల్లాలకు చెందిన 18 మంది మండల పంచాయతీ అధికారుల(ఎంపీవో)కు డివిజనల్‌ పంచాయతీ అధికారులు(డీఎల్‌పీవో)గా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ జి.సృజన ఓ ప్రొసీడింగ్‌ జారీ చేశారు. అడహక్‌ పద్ధతిన ఎంపీవోలకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్‌, నిర్మల్‌, జగిత్యాల, సిద్దిపేట, మెదక్‌, సిరిసిల్ల, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, ఖమ్మం, హన్మంకొండ, మంచిర్యాల జిల్లాల పరిధిలోని ఆయా డివిజన్లను డీఎల్‌పీలుగా పదోన్నతి పొందినవారికి కేటాయించినట్లు తెలిపారు

Updated Date - Sep 11 , 2025 | 06:04 AM