సింగరేణికి 137 వసంతాలు...
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:26 PM
బొగ్గు ఉత్పత్తిలో రారాజు సింగరేణి కాలరీస్ కంపెనీ డిసెం బరు 23తో 136 వసంతాలు పూర్తి చేసుకొని, 137వ వ సంతంలోకి అడుగు పెడుతోంది. ఏటేటా తన కార్యక లాపాలను విస్తరిస్తున్న సింగరేణి నూతన ఆవిష్కరణ లతో ముందుకు సాగుతోంది.
-నూతన ఆవిష్కరణలతో విరాజిల్లుతున్న సంస్థ
-ఏటేటా విస్తరిస్తున్న సంస్థ కార్యకలాపాలు
-నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం
-ఇతర రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తికి సన్నాహాలు
మంచిర్యాల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బొగ్గు ఉత్పత్తిలో రారాజు సింగరేణి కాలరీస్ కంపెనీ డిసెం బరు 23తో 136 వసంతాలు పూర్తి చేసుకొని, 137వ వ సంతంలోకి అడుగు పెడుతోంది. ఏటేటా తన కార్యక లాపాలను విస్తరిస్తున్న సింగరేణి నూతన ఆవిష్కరణ లతో ముందుకు సాగుతోంది. ’’ద హైద్రాబాద్ (దక్కన్) కంపెనీ లిమిటెడ్’’గా పిలవబడే సంస్థ తొలిసారిగా 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించగా 1920 డిసెం బర్ 23న సింగరేణి కాలరీస్ లిమిటెడ్గా అవతరించిం ది. భారతదేశంలో 1774 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాంచీలోని రాణిగంజ్ కోల్ఫీల్డ్ పేరిట మే 4న బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. 1956లో బొగ్గు ఉత్ప త్తిని పెంచుకోవడానికి శాస్త్రీయ పరమైన అభివృద్ధి కార్య క్రమాలు, పంచవర్ష ప్రణాళికలు వంటివి భారత ప్రభు త్వం ప్రవేశపెట్టింది. భారతదేశంలోనే మొట్టమొదటి ప్ర భుత్వరంగ సంస్థగా సింగరేణి పేరు, ప్రఖ్యాతులు గడిం చింది. 19వ శతాబ్దపు పూర్వార్థంలో ఈ ప్రాంతంలో అన్వేషణ జరిపి బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.
నూతన ఆవిష్కరణలతో...
136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రగల సింగరేణి సంస్థ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో ముందుకు సా గుతూ ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. బొ గ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సంస్థ కాలక్రమేణ తన కార్యకలాపాలను విస్తరించడం ద్వారా సోలార్ వి ద్యుత్ ఉత్పత్తి రంగంలో అడుగిడింది. పర్యావరణహిత, వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా సింగరేణి వ్యాప్తం గా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి నాంది పలికింది. అంతే గాక థర్మల్, సోలార్, పంప్డ్ స్టోరేజీ, జియో థర్మల్ ప్రాజెక్టుల ఏర్పాటు, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియం నై ట్రేట్ తయారీ, కార్బన్ డై యాక్సైడ్ నుంచి మిథనాల్ ఉత్పత్తికి చర్యలు చేపడుతోంది. కంపెనీ సుస్థిర అభివృద్ది కోసం నూతన ప్రాజెక్టుల సాధనకు యాజ మాన్యం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ ఏరియాలలో నూతన గనుల ఏర్పాటుకు అనుమతులు సైతం సాధించింది.
కార్మికులకు లాభాల వాటా....
సింగరేణి కార్మికులకు ఈ ఏడాది అత్యధిక లాభాలా వాటాను కూడా పంపిణీ చేసింది. 2024-25 ఆర్థిక సం వత్సరానికిగాను సంస్థ ఆర్జించిన నికర లాభం రూ. 6,394 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులో సిం గరేణి భవిష్యత్తులో చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం రూ. 4,034 కోట్లను కేటాయించగా, మిగిలిన రూ. 2,360 కోట్లలో 34 శాతం కింద రూ. 819 కోట్లను కార్మికుల వా టాగా ప్రకటించారు. లాభాల వాటాతో సంస్థలో పని చేస్తున్న 41వేల మంది కారికులకు ప్రభుత్వం ప్రకటిం చిన ప్రకారం 34 శాతం బోనస్ కింద ఒక్కొక్కరికి సగ టున రూ. 1,95,610 వరకు లభించింది. గత ఏడాది సగటున ఒక్కో కార్మికునికి రూ. 1,87,321 లాభాల బోన స్ చెల్లించగా, ఈ ఏడాది ఒక్కో ఉద్యోగికి గత సంవ త్సరానికి అదనంగా రూ. 8,289 వరకు లాభాల బోనస్ లభించింది.
నైనీ బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం....
తెలంగాణ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణి బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుడుతోంది. ఒడిశాలోని నైనీ ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో యాజమాన్యం ముందడుగు వేస్తోంది. నైనీ బొగ్గు బ్లా క్లో ఉత్పత్తికి జూలై 12న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టి విక్రమార్క ఒడిశా ముఖ్యమంత్రితో సమావేశ మై బొగ్గు ఉత్పత్తిపట్ల చర్చించగా సానుకూల స్పందన లభించింది. నైనీ బ్లాక్కు ఇప్పటికే అవసరమైన అను మతులు, భూ కేటాయింపు ప్రక్రియ పూర్తికాగా త్వరలో ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
40వేల మంది కార్మికులతో...
గతంలో లక్షా 16 వేల కార్మికులతో కళకళలాడిన సిం గరేణి సంస్థ ప్రస్తుతం కార్మికులను గణనీయంగా తగ్గిం చే పనిలో నిమగ్నమైంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న సింగరేణి కార్మికుల సంఖ్య ప్రస్తుతం 40 వేలకు పడిపో యింది. బొగ్గు లక్ష్యాలు పెరుగుతున్నప్పటికీ ప్రైవేటీక రణ, కాంట్రాక్టీకరణ, ఔట్సోర్సింగ్ ఫలితంగా కార్మికుల సంఖ్యను క్రమంగా కుదిస్తూ వస్తున్నారు. పర్మినెంట్ కార్మికుల స్థానంలో బొగ్గు బావుల్లో సుమారు రెండు న్నర లక్షలకు పైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మి కులతో పనులు చేయిస్తున్నారు. కొత్త గనులు ప్రారం భించడం ద్వారా ఉద్యోగవకాశాలు కల్పించాల్సిన అవస రం ఎంతైనా ఉంది. తద్వారా కార్మికుల సంఖ్యను పెం చుతూ గత చరిత్ర పునరావృతం కోసం పాటుపడాలని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి.