Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..తొలిరోజు 10 నామినేషన్లు
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:17 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజు సోమవారం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో రెండు రిజిస్టర్ పార్టీలకు చెందిన...
క్యాబినెట్లో గిరిజనులకు స్థానం కల్పించాలనే డిమాండ్తో సూర్యాపేట జిల్లా వాసి పోటీ
హైదరాబాద్ సిటీ, మఠంపల్లి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజు సోమవారం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో రెండు రిజిస్టర్ పార్టీలకు చెందిన అభ్యర్థులు, 8 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణ సమితి తరఫున పూస శ్రీనివాస్, నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్లు నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి పి.సాయిరాం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. కాగా క్యాబినెట్లో గిరిజనులకు స్థానం కల్పిచాలనే డిమాండ్తో, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే డిమాండ్తో సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన సుమాన్ నాయక్ పోటీస్తున్నారు. 2019 ఎన్నికల్లో హుజూర్నగర్ ఉప ఎన్నికలోనూ సుమన్నాయక్ పోటీ చేయగా 2,697 ఓట్లు వచ్చాయి. ఇక.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకు కొన్నిగంటల ముందు షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈసీఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి నామినేషన్ల స్వీకరణకు సర్వ సన్నద్ధంగా ఉండాలని రిటర్నింగ్ అధికారి పి.సాయిరాంకు సూచించారు.