శ్రీతేజకు స్వర్ణం
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:06 AM
జాతీయ జూనియర్ (అండర్-20) ఫెడరేషన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో తెలంగాణకు చెందిన శ్రీతేజ తోలం స్వర్ణం...
ప్రయాగ్రాజ్: జాతీయ జూనియర్ (అండర్-20) ఫెడరేషన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో తెలంగాణకు చెందిన శ్రీతేజ తోలం స్వర్ణం సాధించింది. హెప్టాథ్లాన్లో శ్రీతేజ 4735 పాయింట్లతో విజేతగా నిలిచింది. హర్షిత (ఢిల్లీ), జాస్మిన్ (కేరళ) రజత, కాంస్య పతకాలు సాధించారు. కాగా, పురుషుల 800 మీటర్ల రేసులో తెలంగాణకే చెందిన వినోద్ కుమార్ (1 నిమిషం 50.28 సె) కాంస్యం దక్కించుకొన్నాడు.
ఇవీ చదవండి:
గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు!
లగ్జరీ అపార్ట్మెంట్స్ కొన్న దూబె
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి