ఐపీఎల్ సమయంలోనే పిఎస్ఎల్
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:16 AM
వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ సమయంలోనే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎ్సఎల్)ను నిర్వహించేందుకు పాక్ బోర్డు యత్నిస్తోంది. సహజంగా...
లాహోర్: వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ సమయంలోనే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎ్సఎల్)ను నిర్వహించేందుకు పాక్ బోర్డు యత్నిస్తోంది. సహజంగా పీఎ్సఎల్ కోసం ఫిబ్రవరి-మార్చి విండో ఉంది. అయితే, 2026 టీ20 వరల్డ్క్పను కూడా ఫిబ్రవరి-మార్చిలో షెడ్యూల్ చేశారు. దీంతో ఏప్రిల్-మేలో ఐపీఎల్ జరిగే సమయంలోనే పీఎ్సఎల్ను జరపాలనుకొంటున్నారు. ఈ ఏడాది చాంపియన్స్ లీగ్ నేపథ్యంలో ఐపీఎల్ విండోలోనే పీఎ్సఎల్ కూడా నిర్వహించారు. ఇలా చేయడం వల్ల తమకు ఎటువంటి నష్టమూ కలగలేదని పీఎ్సఎల్ తెలిపింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి