పారా స్విమ్మర్ గణేష్ రికార్డు
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:56 AM
శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారత్లోని ధనుష్కోటి తీరాన్ని అత్యంత తక్కువ సమయంలో ఈదిన పారా స్విమ్మర్గా గణేష్ రికార్డు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారత్లోని ధనుష్కోటి తీరాన్ని అత్యంత తక్కువ సమయంలో ఈదిన పారా స్విమ్మర్గా గణేష్ రికార్డు సృష్టించాడు. శుక్రవారం ఉదయం 5.50 గంటలకు శ్రీలంకలో ఈత మొదలు పెట్టిన గణేష్ సాయంత్రం 4.20 గంటలకు ధనుష్కోటి తీరానికి చేరుకున్నాడు. మొత్తం 28 కిలోమీటర్ల దూరాన్ని గణేష్ 10 గంటల 30 నిమిషాల్లో ముగించాడు. ఎన్ఐఎ్స కోచ్ అయిన గణేష్ ప్రస్తుతం ఏలూరులో జిల్లాలో శాప్ స్విమ్మింగ్ కోచ్గా పని చేస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..