పాక్ మ్యాచ్లు కొలంబోలో
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:12 AM
హైబ్రిడ్ ఫార్మాట్లో జరిగే మహిళల వన్డే వరల్డ్కప్ వేదికలను ఐసీసీ సోమవారం ప్రకటించింది. టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. తటస్థ వేదికగా శ్రీలంకలోని కొలంబోను ఎంపిక చేశారు...
మహిళల వన్డే వరల్డ్కప్
వేదికగా వైజాగ్ కూడా
దుబాయ్: హైబ్రిడ్ ఫార్మాట్లో జరిగే మహిళల వన్డే వరల్డ్కప్ వేదికలను ఐసీసీ సోమవారం ప్రకటించింది. టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. తటస్థ వేదికగా శ్రీలంకలోని కొలంబోను ఎంపిక చేశారు. పాకిస్థాన్ ఆడే మ్యాచ్లన్నీ ఇక్కడ జరుగుతాయి.. సెప్టెంబరు 30 నుంచి నవంబరు 2 వరకు జరిగే వరల్డ్కప్ కోసం బెంగళూరు, గువాహటి, ఇండోర్, విశాఖపట్నంతోపాటు కొలంబోను వేదికలుగా ఖరారు చేశారు. సెప్టెంబరు 30న తొలి మ్యాచ్లో భారత్ ఆడనుంది. అక్టోబరు 29న తొలి సెమీ్స గువాహటి లేదా కొలంబోలో, 30న రెండో సెమీస్ బెంగళూరులో జరుగుతాయి. నవంబరు 2న బెంగళూరు లేదా కొలంబోలో ఫైనల్ నిర్వహిస్తారు. భారత్తోపాటు డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్ టోర్నీలో ఆడనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి