Share News

డైమండ్‌ బరిలో చోప్రా సహా నలుగురు

ABN , Publish Date - May 12 , 2025 | 05:48 AM

డైమండ్‌ లీగ్‌ (డీఎల్‌) మీట్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నలుగురు భారత అథ్లెట్లు బరిలో దిగనున్నారు. ఈ ఈవెంట్‌ శుక్రవారం దోహాలో జరగనుంది...

డైమండ్‌ బరిలో చోప్రా సహా నలుగురు

దోహా: డైమండ్‌ లీగ్‌ (డీఎల్‌) మీట్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నలుగురు భారత అథ్లెట్లు బరిలో దిగనున్నారు. ఈ ఈవెంట్‌ శుక్రవారం దోహాలో జరగనుంది. ఒలింపిక్‌ మాజీ చాంపియన్‌, స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సహచరుడు కిశోర్‌ జనా, పురుషుల 5000 మీటర్ల రేస్‌లో జాతీయ రికార్డు సాధించిన గుల్వీర్‌ సింగ్‌, మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పారుల్‌ చౌదరి పోటీపడనున్నారు. 2023లో డైమండ్‌ లీగ్‌ విజేతగా నిలిచిన నీరజ్‌ చోప్రా.. 2024 ఈవెంట్‌లో రన్నర్‌పగా సరిపెట్టుకొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 12 , 2025 | 06:46 AM