Share News

దిలీప్‌ దోషి మృతికి నివాళిగా

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:59 AM

భారత మాజీ స్పిన్నర్‌, 77 ఏళ్ల దిలీప్‌ దోషి గుండెపోటుతో లండన్‌లో కన్నుమూశాడు. దీంతో మంగళవారం చివరి రోజు ఆట ఆరంభానికి ముందు...

దిలీప్‌ దోషి మృతికి నివాళిగా

భారత మాజీ స్పిన్నర్‌, 77 ఏళ్ల దిలీప్‌ దోషి గుండెపోటుతో లండన్‌లో కన్నుమూశాడు. దీంతో మంగళవారం చివరి రోజు ఆట ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించడంతో పాటు తమ చేతులకు నల్ల బ్యాడ్జీలు ధరించారు. 1970 దశకంలో మేటి స్పిన్నర్‌గా కొనసాగిన దోషి 33 టెస్టుల్లో 114 వికెట్లు, అలాగే 15 వన్డేల్లో 22 వికెట్లు తీశాడు. మరోవైపు ఇదివరకే టెస్టు తొలి రోజు అహ్మదాబాద్‌ విమాన ప్రమాద మృతులకు, ఆ తర్వాత ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ డేవిడ్‌ వాలెంటైన్‌ మృతికి నివాళిగా రెండు పర్యాయాలు జట్లు నల్ల బ్యాడ్జీలు ధరించిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి:

గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు!

టీమిండియాను వదలని డకెట్

లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 12:59 AM