Seychelles Boxing Tournament: ఫైనల్లో మనోళ్లు ఆరుగురు
ABN , Publish Date - Jun 23 , 2025 | 02:53 AM
సీషెల్స్ నేషనల్ డే బాక్సింగ్ టోర్నీలో ఆరుగురు భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకుపోయారు. ఆదివారం జరిగిన 65 కిలోల విభాగం మూడో రౌండ్లో ఆదిత్య ప్రతాప్...
సీషెల్స్ బాక్సింగ్ టోర్నీ
మహే (సీషెల్స్): సీషెల్స్ నేషనల్ డే బాక్సింగ్ టోర్నీలో ఆరుగురు భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకుపోయారు. ఆదివారం జరిగిన 65 కిలోల విభాగం మూడో రౌండ్లో ఆదిత్య ప్రతాప్ స్థానిక ఫేవరెట్ జొవానీ బౌజిన్ను ఓడించాడు. 50కి.లలో హిమాన్షు శర్మ 4-1తో సౌప్రేయన్ (మారిషన్)పై, 55 కి. విభాగంలో అశిష్ 4-1తో ఫ్రాన్సిస్ (మారిష్స)పై, 60కి.లలో అన్మోల్ 4-1తో డారియో (సీషెల్స్)పై నెగ్గి ఫైనల్ చేరారు. 75కి.లలో నీరజ్, 90+కి. విభాగంలో గౌరవ్ చౌహాన్ కూడా ఫైనల్లోకి ప్రవేశించారు.