పాక్ టోర్నీలో ఆడేది లేదు
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:35 AM
పాకిస్థాన్లో జరిగే మధ్య ఆసియా వాలీబాల్ చాంపియన్షి్ప నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇటీవల పహల్గాంలో...

భారత వాలీబాల్ జట్టు
న్యూఢిల్లీ: పాకిస్థాన్లో జరిగే మధ్య ఆసియా వాలీబాల్ చాంపియన్షి్ప నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇటీవల పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. మే 28 నుంచి జూన్ 4 వరకు ఇస్లామాబాద్లో జరిగే ఈ చాంపియన్షి్పలో ప్రాతినిథ్యంపై గతంలోనే భారత్ అంగీకారం తెలిపింది. అయితే తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లకూడదని భారత వాలీబాల్ సమాఖ్య నిర్ణయించుకుంది.