విశాఖ చేరిన ఢిల్లీ ఆటగాళ్లు
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:08 AM
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో తాము ఆడే తొలి రెండు మ్యాచ్లకు ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని...
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో తాము ఆడే తొలి రెండు మ్యాచ్లకు ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని హోమ్ గ్రౌండ్గా చేసుకున్న అక్షర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సోమవారం నగరానికి చేరుకుంది. ఈనెల 24న సూపర్ జెయింట్స్తో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. కులదీప్ యాదవ్, కేఎల్ రాహుల్ మంగళవారం నగరానికి చేరుకోనున్నారు.