Share News

అవన్నీ వదంతులే

ABN , Publish Date - May 20 , 2025 | 03:51 AM

ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఆసియాకప్‌ నుంచి భారత్‌ వైదొలగుతున్నదంటూ వస్తున్న వదంతులను బీసీసీఐ ఖండించింది. ఇండో-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో...

అవన్నీ వదంతులే

ఆసియాక్‌ప బాయ్‌కాట్‌

ఊహాగానాలను

ఖండించిన బీసీసీఐ

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఆసియాకప్‌ నుంచి భారత్‌ వైదొలగుతున్నదంటూ వస్తున్న వదంతులను బీసీసీఐ ఖండించింది. ఇండో-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియాకప్‌, మహిళల ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియాకప్‌ టోర్నీల నుంచి తప్పుకోవాలని బీసీసీఐ నిర్ణయించుకున్నదంటూ సోమవారం జోరుగా పుకార్లు వినిపించాయి. ప్రస్తుతం ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) చీఫ్‌గా పాకిస్థాన్‌ మంత్రి, పీసీబీ చైర్మన్‌ మొహిసిన్‌ నక్వీ ఉండడమే ఈ వదంతులకు కారణంగా తెలుస్తోంది. ‘ఆసియాకప్‌ ఈవెంట్ల నుంచి బీసీసీఐ తప్పుకోనుందంటూ ఊహాజనిత వార్తలు ఉదయం నుంచి చక్కర్లు కొడుతున్నాయి. కానీ, వాటిల్లో నిజం లేదు. ప్రస్తుతం మా దృష్టంతా ఐపీఎల్‌, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీ్‌సపైనే. ఏదైనా నిర్ణయం తీసుకొంటే అధికారికంగా ప్రకటన చేస్తామ’ని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్‌ సైకియా తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 03:51 AM