అర్జున్ బృందానికి నిరాశ
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:01 AM
ఫిడే వరల్డ్ ర్యాపిడ్ టీమ్ చాంపియన్షి్పను గెలుచుకున్న ఉత్సాహంలో.. బ్లిట్జ్ టైటిల్నూ సొంతం చేసుకోవాలనుకున్న భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి...
వరల్డ్ బ్లిట్జ్ టీమ్ చెస్ నాకౌట్లో ఓటమి
లండన్: ఫిడే వరల్డ్ ర్యాపిడ్ టీమ్ చాంపియన్షి్పను గెలుచుకున్న ఉత్సాహంలో.. బ్లిట్జ్ టైటిల్నూ సొంతం చేసుకోవాలనుకున్న భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి సారథ్యంలోని ఎంజీడీ1 జట్టుకు నిరాశే ఎదురైంది. అర్జున్, హరికృష్ణ, ప్రణవ్, ల్యూక్ మెన్డోన్కా, స్టరౌలా సొలాకిడో, అథర్వ టయాడోతో కూడిన ఈ బృందానికి నాకౌట్లో చుక్కెదురైంది. అర్జున్ జట్టును హెక్జామైండ్ జట్టు ఓడించి సెమీఫైనల్ చేరింది. ఇక, విశ్వనాథన్ ఆనంద్ సారథ్యంలోని ఫ్రీడమ్ జట్టుకూ నిరాశ తప్పలేదు. నాకౌట్లో ఫ్రీడమ్ టీమ్పై కజ్ చెస్ జట్టు గెలిచింది. ఇతర నాకౌట్ మ్యాచుల్లో అష్దోద్ ఎలీట్ క్లబ్పై ఉజ్బెకిస్థాన్, జర్మనీ అండ్ ఫ్రెండ్స్పై డబ్ల్యూఆర్ చెస్ విజయం సాధించాయి. ఆ తర్వాత జరిగిన సెమీఫైనల్స్లో హెక్జామైండ్ను డబ్ల్యూఆర్ఎస్ చెస్ జట్టు, ఉజ్బెకిస్థాన్ను కజ్ చెస్ జట్టు ఓడించి ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాయి.
ఇవీ చదవండి:
వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి