Share News

Archery World Cup 2025: సెమీస్‌లో దీపిక, సుశాంత్‌

ABN , Publish Date - May 10 , 2025 | 05:17 AM

ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2 పోటీల్లో భారత తుపానులైన దీపికా కుమారి మరియు పార్థ్‌ సుశాంత్‌ సెమీఫైనల్స్‌కు చేరారు. మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ ఈవెంట్‌లో మధుర-అభిషేక్‌ వర్మ జోడీ బ్రిటన్‌ చేతిలో ఓడి కాంస్యం కోసం పోటీపడనుంది.

Archery World Cup 2025: సెమీస్‌లో దీపిక, సుశాంత్‌

  • ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌-2

షాంఘై: ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2 పోటీల్లో భారత సీనియర్‌ దీపికా కుమారి, పార్థ్‌ సుశాంత్‌ సాలుంఖే రికర్వ్‌ ఈవెంట్‌ వ్యక్తిగత విభాగాల్లో సెమీఫైనల్స్‌కు చేరారు. మహిళల క్వార్టర్స్‌లో దీపిక 6-4తో విక్టోరియా సెబాస్టియన్‌ (ఫ్రాన్స్‌)పై, పురుషుల్లో పార్థ్‌ సుశాంత్‌ 6-2తో కిమ్‌ డే జోంగ్‌ (కొరియా)పై నెగ్గారు. ఇక, కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ సెమీ్‌సలో భారత ద్వయం మధుర/అభిషేక్‌ వర్మ 156-158తో బ్రిటన్‌ జోడీ చేతిలో ఓడింది. దీంతో భారత జంట కాంస్య పతక కోసం మలేసియా జోడీతో తలపడనుంది.

Updated Date - May 10 , 2025 | 05:17 AM