Health Risks-Workforce: భారత్లో యువ ఉద్యోగుల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఇవే
ABN, Publish Date - Sep 26 , 2025 | 10:44 PM
ఇండియా వర్క్ ప్లేస్ వెల్ బీయింగ్ రిపోర్టు-2025 ప్రకారం, దేశంలో యువ ఉద్యోగులను వేధిస్తున్న సమస్యలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
1/8
ప్రతి 10 మంది ఉద్యోగుల్లో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇవి వారి పనితీరుపై కూడా ప్రభావం చూపుతోంది.
2/8
40 ఏళ్లకు ముందే గుండె సమస్యలు మొదలవడంతో అనేక మంది యువ ఉద్యోగులు సతమతం అవుతున్నారు.
3/8
25–35 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో 14% మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.
4/8
20-30 ఏళ్ల వారిని కూడా థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్ వంటి వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి.
5/8
తలనొప్పులు, ఇన్ఫెక్షన్లు వంటి సాధారణ అనారోగ్యాలు బారిన పడటం రోజువారి ఉత్పాదకతను తగ్గిస్తోంది.
6/8
20ల్లో ఉన్న 70% మంది ఉద్యోగులు పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
7/8
అనారోగ్యం చుట్టుముట్ట కుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సంరక్షణ చర్యలపై చాలా మంది ఉద్యోగుల్లో అవగాహన ఉండటం లేదు
8/8
ఉద్యోగుల ఆరోగ్యాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా సంస్థలు వారి నిద్ర వేళలు, ఒత్తిడి, ఆరగ్య సమస్యలను ముందుగా గుర్తించడం వంటివి చేయాలి
Updated at - Sep 26 , 2025 | 10:44 PM