Fine Rice Distribution: తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం
ABN, Publish Date - Apr 01 , 2025 | 11:13 AM
Fine Rice Distribution: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదలకు మరింత లాభం చేకూరనుంది.
1/8
ఉగాది పండుగను (మార్చి 30) పురస్కరించుకుని హూజూర్నగర్ వేదికగా రేషన్ కార్డుదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు.
2/8
ఏప్రిల్ 1 అంటే నేటి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది.
3/8
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్లో సన్న బియ్యం పంపిణీని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తాహెర్బిన్ హందాన్ ప్రారంభించారు.
4/8
ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యాన్నీ పంపిణీ చేసేవారు. ఇకపై దొడ్డుబియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.
5/8
గత ఖరీఫ్లో వచ్చిన పంటను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది
6/8
దాదాపు 24 లక్షల టన్నుల వడ్లను ప్రభుత్వం సేకరించి.. వాటిని మిల్లింగ్ చేయించి పేదలకు పంపిణీ చేస్తోంది
7/8
ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తారు.
8/8
లబ్దిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు
Updated at - Apr 01 , 2025 | 11:13 AM