Mallojula Venugopal: మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత మల్లోజుల బృందం
ABN, Publish Date - Oct 15 , 2025 | 08:27 PM
ఆయుధాలను వీడి 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల అధికారికంగా లొంగుబాటు
1/10
జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ బృందం
2/10
సీఎం సమక్షంలో తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించిన మావోయిస్టులు
3/10
మల్లోజుల, ఆయన బృందాన్ని జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించిన సీఎం ఫడ్నవీస్
4/10
మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు
5/10
మల్లోజులపై వందకు పైగా కేసులు.. మల్లోజుల సొంత రాష్ట్రం తెలంగాణ
6/10
పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్రావు మూడో సంతానం
7/10
తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి
8/10
చదువు పూర్తయిన అనంతరం తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలోకి ప్రవేశం
9/10
మల్లోజులను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు
10/10
మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డు ఉన్నట్లు ప్రకటించిన గడ్చిరోలి పోలీసులు
Updated at - Oct 15 , 2025 | 08:29 PM