Warangal Veerabhadra Temple : వేయిస్తంభాల ఆలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు
ABN, Publish Date - Sep 21 , 2025 | 10:33 PM
వరంగల్ వేయిస్తంభాల ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఇవాళ(ఆదివారం) ఘనంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క
1/8
వరంగల్ వేయిస్తంభాల ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఇవాళ(ఆదివారం) ఘనంగా ప్రారంభమయ్యాయి.
2/8
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారు.
3/8
పూల జాతరకు భారీగా మహిళలు తరలి వచ్చారు. బతుకమ్మ సంబరాల నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
4/8
ప్రకృతి పండగ బతుకమ్మ. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కోరుకుంటున్నాని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
5/8
తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏకం చేసింది బతుకమ్మ పండుగ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
6/8
ఏడాదికొకసారి వచ్చే బతుకమ్మకు చాలా చరిత్ర ఉందని మంత్రి సీతక్క అన్నారు.
7/8
తెలంగాణ పచ్చగా ఉండాలని మహిళలు దీవించాలని మంత్రి కొండా సురేఖ కోరారు.
8/8
'చిత్తూ చిత్తూల బొమ్మ' అంటూ కొండా సురేఖ బతుకమ్మ పాట పాడగా, మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, మేయర్ గుండు సుధారాణి, గద్దర్ కూతురు వెన్నెల, మహిళలు కోరస్ ఇచ్చారు.
Updated at - Sep 21 , 2025 | 10:33 PM