Share News

Skin Pigmentation Remedies: ఇలా చేస్తే పిగ్మెంటేషన్‌ మాయం

ABN , Publish Date - Nov 06 , 2025 | 04:37 AM

ఎండలో ఎక్కువగా తిరగడం, వాతావరణ కాలుష్యం వల్ల చర్మం ఛాయ తగ్గి ముఖంపై పిగ్మెంటేషన్‌ ఏర్పడుతూ ఉంటుంది. చిన్న చిట్కాలతో దీన్ని పోగొట్టుకోవచ్చు....

Skin Pigmentation Remedies: ఇలా చేస్తే పిగ్మెంటేషన్‌ మాయం

ఎండలో ఎక్కువగా తిరగడం, వాతావరణ కాలుష్యం వల్ల చర్మం ఛాయ తగ్గి ముఖంపై పిగ్మెంటేషన్‌ ఏర్పడుతూ ఉంటుంది. చిన్న చిట్కాలతో దీన్ని పోగొట్టుకోవచ్చు. ఆ వివరాలు...

  • బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకుంటే పిగ్మెంటేషన్‌ సమస్య రాదు.

  • రాత్రి పడుకునేముందు ముఖానికి కలబంద గుజ్జు పట్టించి ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే కలబందలోని అలోయిన్‌ పదార్థం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

  • రోజూ ఉదయాన్నే ఆలుగడ్డ రసం లేదా పెరుగును ముఖానికి పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండురోజులకు ఒకసారి చేస్తూ ఉంటే ముఖం కళకళలాడుతుంది.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల శనగపిండి, ఒక చెంచా పసుపు వేసి నాలుగు చెంచాల గులాబీ నీరు చిలకరించి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత వేళ్లతో మెల్లగా రుద్దుతూ పిండిని తొలగించాలి. ఆపైన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసు కుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాయాలి. పావు గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే సమస్య తీరుతుంది.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల బియ్యప్పిండి, ఒక చెంచా ముల్తాని మిట్టి, నాలుగు చెంచాల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటసేపు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే ముఖంపై పిగ్మెంటేషన్‌ మచ్చలు తొలగిపోతాయి.

  • ఒక పళ్లెంలో బియ్యప్పిండి లేదా శనగపిండి తీసుకుని మధ్యకు కోసిన టమాటా ముక్కతో అద్దాలి. దీంతో ముఖాన్ని పది నిమిషాలు మెల్లగా రుద్దాలి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది.

  • ముఖానికి బాగా పండిన బొప్పాయిపండు గుజ్జు లేదా టమాటా రసం రాసినా నలుపుదనం తగ్గుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

Updated Date - Nov 06 , 2025 | 04:37 AM