ఈ వారం వివిధ కార్యక్రమాలు 9 11 2025
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:53 AM
‘నాగటి తరం’ నవల, కాళోజీ పురస్కారాలు, ‘మట్టిపువ్వు’ కవిత్వ సంపుటి, ‘తెలంగాణ దేశీ సాహిత్య గంప’, తెలంగాణలో మహిళల కథలు..
‘నాగటి తరం’ నవల
నందిని సిధారెడ్డి నవల ‘నాగటి తరం’ ఆవిష్కరణ సభ నవంబర్ 16 ఉ.10గం.లకు సిద్ధిపేట జిల్లా బందారంలో జరుగుతుంది. ఆ హ్వానం నర్ర భగవాన్రెడ్డి; అధ్య క్షత బైస దేవదాసు; ఆవిష్కరణ వాసిరెడ్డి నవీన్; సమీక్ష నాళేశ్వ రం శంకరం; ఆత్మీయ అతిథులు దేవీ ప్రసాద్, దేశపతి శ్రీనివాస్, విరాహత్ అలీ, నక్క యాదవ రెడ్డి, కందుకూరి శ్రీరాములు తదితరులు.
సిద్దెంకి యాదగిరి
కాళోజీ పురస్కారాలు
కాళోజీ సోదరుల యాది సభ, కాళోజీ పురస్కారాల ప్రదానం నవంబర్ 13 సా.6గం.లకు వాగ్దేవి డిగ్రీ అండ్ పిజీ కళాశాల, కిషన్ పుర, హన్మకొండలో జరుగుతాయి. అధ్యక్షత ఎస్. జీవన్ కుమార్, ముఖ్య అతిథి అంపశయ్య నవీన్. పురస్కారాలను మంగారి రాజేందర్, అంజనీ కుమార్ గోయల్ అందుకుంటారు.
కాళోజీ ఫౌండేషన్
‘మట్టిపువ్వు’ కవిత్వ సంపుటి
ఎన్. తిర్మల్ కవిత్వ సంపుటి ‘మట్టి పువ్వు’ ఆవిష్కరణ నవం బర్ 16 సాయంత్రం ఖమ్మంలోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరుగుతుంది. అధ్యక్షత సయ్యద్ హనీఫ్, ఆవిష్కర్త జయధీర్ తిరు మలరావు, ముఖ్య అతిథులు జూలూరి గౌరీశంకర్, జీవన్, మువ్వా శ్రీనివాసరావు, పోటు రంగారావు, నున్నా నాగేశ్వర రావు తదితరులు.
ఎన్. అరుణ
‘తెలంగాణ దేశీ సాహిత్య గంప’
తెలంగాణ సాహిత్య అకాడమి ‘సాహిత్యవారం’ కార్యక్రమంలో భాగంగా కాలువ మల్లయ్య రెండు పుస్తకాలు ‘తెలంగాణ దేశీ భాష సాహిత్య గంప’, ‘బుక్ ఆఫ్ కల్చర్’ (ఇంగ్లీష్) ఆవిష్కరణ సభ నవంబర్ 15 సా.5గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్లో జరుగుతుంది. ఆవిష్కర్త పులికొండ సుబ్బాచారి, పరిచయం టి. గౌరీశంకర్, బాణాల భుజంగరెడ్డి.
నామోజు బాలాచారి
తెలంగాణలో మహిళల కథలు
సాహిత్య అకాడమీ, తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘తెలంగాణలో మహిళల కథలు: వికాసం, విస్తృతి, వైవిధ్యం’ అంశంపై సదస్సు నవంబర్ 15 ఉ.10గం.ల నుంచి కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ బిల్డింగ్, తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్పల్లి లో జరుగుతుంది. ఎల్. సురేశ్ కుమార్, కరిమిండ్ల లావణ్య, ఎస్వీ సత్యనారాయణ, టి. యాదగిరి రావు, సూర్యాధనంజయ్, పి. కనకయ్య, వంగరి త్రివేణి తదితరులు పాల్గొంటారు.
సాహిత్య అకాడమీ
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో నాయకత్వ పోరుపై బీజేపీ పేరడీ వీడియో
హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్