TG Pensioners Issues: 85 ఏళ్లు దాటినవారికి రాని ఏప్రిల్ పెన్షన్
ABN , Publish Date - May 10 , 2025 | 03:41 AM
తెలంగాణాలో 85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు ఏప్రిల్ నెల పెన్షన్లు ఇంకా అందలేదు. వారి పెన్షన్లు విడుదల చేయడానికి, నేరుల నుంచి రక్షణ కల్పించేందుకు పాత పద్ధతిని పునరుద్ధరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 85 సంవత్సరాలు పైబడిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు దాదాపు రెండువేల మందికి ఏప్రిల్ నెల పెన్షన్లు ఇంకా అందలేదు. పెన్షన్ అందని వాళ్ళు తమ పెన్షన్ పేమెంట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి వివరాలు చెప్పాలని కొందరు అంటున్నారు. కానీ దానిలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఆ వివరాలు మన డబ్బులను దొంగిలించే వారి(ఫ్రాడ్స్టర్ల) చేతిలో పడతాయేమో- అని పెన్షనర్లు భయపడుతున్నారు. అందువల్ల పూర్వ పద్ధతిలోనే 85 సంవత్సరాల వయసు పైబడిన వారికి కూడా వాళ్ళ లైఫ్ సర్టిఫికెట్ను ఆమోదించి, లేదా కదలలేని స్థితిలో ఉన్న పెన్షనర్ల దగ్గరికి- న్యాయస్థానాలు చెప్పినట్టుగా -అధికారులు తమ సిబ్బందిని పంపించి -ప్రత్యక్షంగా వెరిఫై చేయించి వారి పెన్షన్లను రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
-మోతుకూరు నరహరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు,
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్