అడ్వాన్స్ టిప్ పై ఉబర్కు నోటీసు
ABN , Publish Date - May 22 , 2025 | 05:28 AM
కస్టమర్లు వేగవంతంగా సర్వీస్ కావాలనుకుంటే అడ్వాన్స్గా టిప్ ఇచ్చే విధంగా ఒత్తిడి చేస్తున్నందుకు ఉబర్కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) నోటీసు జారీ చేసింది....
న్యూఢిల్లీ: కస్టమర్లు వేగవంతంగా సర్వీస్ కావాలనుకుంటే అడ్వాన్స్గా టిప్ ఇచ్చే విధంగా ఒత్తిడి చేస్తున్నందుకు ఉబర్కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) నోటీసు జారీ చేసింది. కస్టమర్లు సర్వీస్ పొందడానికి ముందే టిప్ ఇచ్చేలా చేసే చర్య తీవ్ర ఆందోళనకరం, అనైతికమని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తన సోషల్ మీడియా వేదికపై వ్యాఖ్యానించారు. ఒక సేవను అందుకున్న అనంతరం దానికి సంతృప్తి చెందితే మెచ్చుకుంటూ ఇచ్చేది టిప్ అని, అంతే తప్పితే ముందుగానే ఒత్తిడి చేసి వసూలు చేసేది కాదని పేర్కొంటూ ఆ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని సీసీపీఏను మంత్రి ఆదేశించారు. ఆయన ఆదేశం మేరకు సీసీపీఏ బుధవారం ఉబర్కు నోటీసు జారీ చేసింది.
ఇవీ చదవండి:
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..