Gold Price: 4,300 డాలర్లు దాటిన ఔన్స్ గోల్డ్
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:56 AM
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం సరికొత్త రికార్డు స్థాయికి ఎగబాకింది. ఔన్స్ 31.10 గ్రాములు గోల్డ్ రేటు ఒకదశలో 100 డాలర్లకు పైగా పెరిగి తొలిసారిగా..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం సరికొత్త రికార్డు స్థాయికి ఎగబాకింది. ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు ఒకదశలో 100 డాలర్లకు పైగా పెరిగి తొలిసారిగా 4,300 డాలర్లు దాటింది. అమెరికా-చైనా మధ్య మళ్లీ మొదలైన వాణిజ్య యుద్ధం, యూఎస్ షట్డౌన్ వంటి ప్రతికూలతలతో పాటు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు బులియన్ డిమాండ్ను ఎగదోస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఔన్స్ గోల్డ్ 61 శాతానికి పైగా పెరిగింది. భారత్లో బంగారం ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ రేటు, డాలర్-రూపాయి మారకం విలువకు అనుగుణంగా మారుతుంటాయి. దీంతో శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి మరో రూ.2,800కు పైగా పెరిగి రూ.1.35 లక్షలకు చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎస్జీబీలు అదుర్స్: 2017-18 ఆర్థిక సంవత్సరంలో సీరిస్-3 కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాం డ్స్ (ఎస్జీబీ) కూడా మదుపరులు బంపర్ లాభాలు పంచాయి. 2017 అక్టోబరు 16న జారీ చేసిన ఈ ఎస్జీబీల ఫైనల్ రిడంప్షన్ గడువు గురువారంతో ముగిసింది. ఒక్కో గ్రాము రూ.2,860 చొప్పున ఈ బాండ్స్ కొనుగోలు చేసిన వారికి తుది రిడంప్షన్ నాటికి ఒక్కో గ్రాము ఎస్జీబీపై రూ.12,567 అందుకున్నారు. అంటే ఎనిమిదేళ్ల కాలపరిమితి ముగిసేసరికి మదుపరులు 388 శాతం లాభం కళ్లజూశారు.