Share News

Stock Market: అమ్మకాలు కంటిన్యూ

ABN , Publish Date - May 10 , 2025 | 05:44 AM

భారత్ - పాకిస్తాన్ మధ్య పోరు తీవ్రత కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు కొనసాగించాయి. సెన్సెక్స్ 880 పాయింట్లు నష్టపోయి 79,454.47 స్థాయికి చేరింది, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.09 లక్షల కోట్లు తగ్గింది.

Stock Market: అమ్మకాలు కంటిన్యూ

  • సెన్సెక్స్‌ 880 పాయింట్లు డౌన్‌

  • 2 రోజుల్లో రూ.7 లక్షల కోట్లు ఉఫ్‌

ముంబై: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య పోరు తీవ్రతరమవడంతో అప్రమత్తమైన ఈక్విటీ మదుపరులు వరుసగా రెండో రోజూ అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో మన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 880.34 పాయింట్లు కోల్పోయి 79,454.47 స్థాయికి జారుకుంది. నిఫ్టీ 265.80 పాయింట్లు క్షీణించి 24,008 వద్ద స్థిరపడింది. గడిచిన రెండు సెషన్లలో సెన్సెక్స్‌ 1,292.31 పాయింట్లు (1.60 శాతం) నష్టపోగా.. ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7.09 లక్షల కోట్లు తగ్గి రూ.416.40 లక్షల కోట్లకు (4.86 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 26 నష్టపోయాయి.

రక్షణ రంగ షేర్లు జూమ్‌: పాక్‌తో పోరు నేపథ్యంలో దేశీయ రక్షణ రంగానికి చెందిన ముఖ్యంగా డ్రోన్‌ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈలో పారస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీ స్టాక్‌ 7.18 శాతం పుంజుకోగా.. భారత్‌ డైనమిక్స్‌ 5.34 శాతం, భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ 2.92 శాతం, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ 1.84 శాతం, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ 1.38 శాతం పెరిగాయి. డ్రోన్‌ తయారీదారుల్లో ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీ షేరు ఏకంగా 20 శాతం ఎగబాకింది. డ్రోనాచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్‌ 4.99 శాతం లాభపడింది.

Updated Date - May 10 , 2025 | 05:46 AM