Share News

నెలాఖరులోగా కొత్త బీమా పాలసీ

ABN , Publish Date - May 21 , 2025 | 02:54 AM

ప్రభుత్వ రంగంలోని న్యూ ఇండియా అష్యూరెన్స్‌ ఈ నెలాఖరులోగా సరికొత్త బీమా పాలసీ ప్రారంభించబోతోంది. పారామెట్రిక్‌ పాలసీ పేరుతో ప్రకటించే ఈ పాలసీ ద్వారా...

నెలాఖరులోగా కొత్త బీమా పాలసీ

న్యూ ఇండియా అష్యూరెన్స్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని న్యూ ఇండియా అష్యూరెన్స్‌ ఈ నెలాఖరులోగా సరికొత్త బీమా పాలసీ ప్రారంభించబోతోంది. పారామెట్రిక్‌ పాలసీ పేరుతో ప్రకటించే ఈ పాలసీ ద్వారా రిటైల్‌, వ్యాపార సంస్థలు వాతావరణ మార్పులతో సంభవించే ప్రకృతి విపత్తుల నష్టాలకు పరిహారం పొందవచ్చని సంస్థ సీఎండీ గిరిజా సుబ్రమణియన్‌ చెప్పారు. భారీ వర్షాలు, గాలి వానలు, వరదలు, దుర్భిక్షాలు ఈ కోవలోకి వస్తాయన్నారు. ఈ పాలసీ కింద నిర్ణీత ప్రామాణికాల ప్రకారం నష్టపరిహారం లభిస్తుంది. దీంతో క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌ కూడా త్వరగా పూర్తవుతుంది.

మరిన్ని బిజిెనెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 02:54 AM