దొడ్ల డెయిరీ లాభం రూ 68 కోట్లు
ABN , Publish Date - May 20 , 2025 | 03:27 AM
దొడ్ల డెయిరీ.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.67.96 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 45.12 శాతం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దొడ్ల డెయిరీ.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.67.96 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 45.12 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.787.44 కోట్ల నుంచి రూ.909.62 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.3,720.10 కోట్ల ఆదాయం పై రూ.259.90 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం తొలిసారిగా రూ.200 కోట్ల మైలురాయిని అధిగమించిందని దొడ్ల డెయిరీ ఎండీ సునీల్ రెడ్డి తెలిపారు. కాగా రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2 (20 శాతం) డివిడెండ్ను అందించేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..